www.ntodaynews.com
ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
జాతీయం
అంతర్జాతీయం
ఢిల్లీలోని నజాఫ్గఢ్ ప్రాంతంలో ఘోరం జరిగింది. ఉద్యోగం కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడితో బాధపడుతున్న దినేష్ పటేల్ (48) తన భార్య సరితా పటేల్ (43)ను ఇంట్లో చిన్న వివాదం కారణంగా పెనంతో కొట్టి హత్య చేశాడు. శనివారం రాత్రి ఈ ఘటన జరగ్గా.. నిందితుడు ఆదివారం ఉదయం పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. నిందితుడు స్కిజోఫ్రెనియా అనే వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్నట్లు తెలిపాడు. ఈ ఘటన సమయంలో ఇద్దరు పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. పోలీసలు దర్యాప్తు చేస్తున్నారు.