www.ntodaynews.com
సహజవాయువు సరఫరాపై ఆంక్షలను ఎత్తివేసిన కేంద్రం
జాతీయం
అంతర్జాతీయం
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా సహజవాయువు సరఫరాపై విధించిన అత్యవసర ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. హర్మూజ్ జలసంధి ద్వారా ద్రవీకృత సహజవాయువు రవాణా సాధారణ స్థితికి చేరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది. ఈ చర్యతో పరిశ్రమలు, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు, ఇతర వినియోగదారులపై ఒత్తిడి తగ్గనుంది. సంక్షోభ సమయంలో విధించిన మూడు అత్యవసర నిబంధనల్లో ఇది చివరిది.