BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం

ఆంధ్రప్రదేశ్
/ ఆంధ్రప్రదేశ్
05 Jul, 2026 - 09:04 PM
68 వీక్షణలు

చిత్తూరు జిల్లా | NTODAY NEWS

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని ముఖ్య నేతలు, పార్టీ కార్యకర్తలతో సమావేశమై పార్టీ బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారంపై కీలక సూచనలు చేశారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో సమర్థవంతమైన రాజకీయ పరిపాలన కోసం పోలీసు, అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని పార్టీ నాయకులకు సూచించారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి, వాటి పరిష్కారానికి చొరవ చూపాలని తెలిపారు.

పేదల పక్షాన నిలబడి పనిచేసే తెలుగుదేశం పార్టీ నాయకులను అధికారులు గౌరవించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలును ఎప్పటికప్పుడు పరిశీలించి, ఎక్కడైనా లోపాలు లేదా ఇబ్బందులు ఉంటే వెంటనే సరిదిద్దేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు.

అలాగే పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ, "ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు (ఛారిటీ) చేద్దాం... పార్టీ ద్వారా రాజకీయాలు చేద్దాం" అని పేర్కొన్నారు. సేవా కార్యక్రమాలు, రాజకీయ కార్యకలాపాలను వేర్వేరుగా నిర్వహిస్తూ ప్రజలకు మరింత చేరువ కావాలని సూచించారు.