జనసేన ఎమ్మెల్యేకు సొంత పార్టీ నేత సవాల్
పోలవరం | NTODAY NEWS
పోలవరం నియోజకవర్గ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు చేసిన వ్యాఖ్యలకు బుట్టాయిగూడెం మండల జనసేన పార్టీ అధ్యక్షుడు బుచ్చిరాజు తీవ్రంగా స్పందించారు.
ఇటీవల ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ, "పోలవరం నియోజకవర్గంలో పెత్తందారుల వ్యవస్థ పోవాలి" అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలపై స్పందించిన బుచ్చిరాజు, "పెత్తందారులు మిమ్మల్ని అణిచివేస్తే కోట్ల రూపాయల ఆస్తులు ఎలా సంపాదించారు?" అని ప్రశ్నించారు. అలాగే విలాసవంతమైన ఇల్లు, పాఠశాలలు, రెస్టారెంట్లు, భూములు వంటి ఆస్తులు ఎలా కూడబెట్టారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.
ఈ వ్యాఖ్యలతో పోలవరం నియోజకవర్గ రాజకీయాల్లో మరోసారి చర్చ మొదలైంది. ఈ అంశంపై ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.