ఏపీ వ్యాప్తంగా 12 లక్షల మంది బంగారు కుటుంబాలను గుర్తించాం: CBN
అమరావతి | NTODAY NEWS
ఆంధ్రప్రదేశ్లో పేదరిక నిర్మూలన లక్ష్యంగా చేపట్టిన పీ4 (P4) కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసి జీరో పావర్టీ సాధించే దిశగా కార్యాచరణ కొనసాగుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 12 లక్షల బంగారు కుటుంబాలను గుర్తించామని, వీరికి అండగా నిలిచేందుకు 1.10 లక్షల మంది మార్గదర్శకులు ముందుకు వచ్చారని సీఎం వెల్లడించారు. ఆర్థికంగా ఎదిగిన కుటుంబాలు మరికొంతమందిని ఆదుకునే స్థాయికి చేరుకోవడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
పీ4 కార్యక్రమంపై నిర్వహించిన సమావేశంలో మెగా, అదానీ, టీవీఎస్ మోటార్ సైకిల్స్ సంస్థల ప్రతినిధులు పాల్గొని, బంగారు కుటుంబాలను దత్తత తీసుకుని వారి అభివృద్ధికి సహకరించేందుకు తమ మద్దతు ప్రకటించారు.
సమాజంలో ఆర్థిక అసమానతలను తగ్గిస్తూ ప్రతి కుటుంబం ఆత్మనిర్భరంగా ఎదిగేలా ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు.