BREAKING
సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు దేశభక్తి, ధైర్యసాహసాలకు ప్రతీక అల్లూరి సీతారామరాజు – బొండా ఉమా సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు దేశభక్తి, ధైర్యసాహసాలకు ప్రతీక అల్లూరి సీతారామరాజు – బొండా ఉమా
www.ntodaynews.com

ఏపీ వ్యాప్తంగా 12 లక్షల మంది బంగారు కుటుంబాలను గుర్తించాం: CBN

ఆంధ్రప్రదేశ్
/ ఆంధ్రప్రదేశ్
Reporter
ANNAPAREDDY SIVA NAGENDRA గుంటూరు టౌన్ రిపోర్టర్
05 Jul, 2026 - 09:14 PM
11 వీక్షణలు

అమరావతి | NTODAY NEWS

ఆంధ్రప్రదేశ్‌లో పేదరిక నిర్మూలన లక్ష్యంగా చేపట్టిన పీ4 (P4) కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసి జీరో పావర్టీ సాధించే దిశగా కార్యాచరణ కొనసాగుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 12 లక్షల బంగారు కుటుంబాలను గుర్తించామని, వీరికి అండగా నిలిచేందుకు 1.10 లక్షల మంది మార్గదర్శకులు ముందుకు వచ్చారని సీఎం వెల్లడించారు. ఆర్థికంగా ఎదిగిన కుటుంబాలు మరికొంతమందిని ఆదుకునే స్థాయికి చేరుకోవడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.

పీ4 కార్యక్రమంపై నిర్వహించిన సమావేశంలో మెగా, అదానీ, టీవీఎస్ మోటార్ సైకిల్స్ సంస్థల ప్రతినిధులు పాల్గొని, బంగారు కుటుంబాలను దత్తత తీసుకుని వారి అభివృద్ధికి సహకరించేందుకు తమ మద్దతు ప్రకటించారు.

సమాజంలో ఆర్థిక అసమానతలను తగ్గిస్తూ ప్రతి కుటుంబం ఆత్మనిర్భరంగా ఎదిగేలా ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు.