‘తల్లికి వందనం’ పథకం.. ఇలా చేయండి
అమరావతి | NTODAY NEWS
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం కింద ఈ నెల 16, 17, 18 తేదీల్లో అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో రూ.13,000 చొప్పున జమ చేయనుంది.
ఈ పథకానికి తాము అర్హులా కాదా అనే విషయాన్ని ప్రభుత్వం అందుబాటులో ఉంచిన అధికారిక పోర్టల్లో తెలుసుకోవచ్చు. అలాగే అర్హులైన వారికి నిధులు జమ కావాలంటే ఆధార్ సంఖ్య బ్యాంక్ ఖాతాకు అనుసంధానం (Aadhaar Seeding) చేసి ఉండాలి. ఇంకా ఈ-కేవైసీ (e-KYC) పూర్తి చేయని వారు వెంటనే పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.
అర్హతను చెక్ చేసుకునేందుకు అధికారిక వెబ్సైట్:
https://bm-sgsw.ap.gov.in/BM/Schemeout
ప్రభుత్వం నిర్దేశించిన అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన లబ్ధిదారుల ఖాతాల్లోనే నిధులు జమ కానున్నాయి. కాబట్టి ఆధార్-బ్యాంక్ లింకింగ్, ఈ-కేవైసీ వివరాలను ఒకసారి పరిశీలించుకోవాలని సూచిస్తున్నారు.