www.ntodaynews.com
నంద్యాలలో ఇద్దరు టీచర్లు సస్పెండ్
ఆంధ్రప్రదేశ్
/
నంద్యాల
నంద్యాల మండలంలోని ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి జనార్ధన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
పులిమద్ది ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కృష్ణారావు ఈ నెల 1 నుంచి 3వ తేదీ వరకు సెలవులో ఉండగా, ఆయన స్థానంలో ఎస్జీటీ విజయ్ భాస్కర్ విధులు నిర్వహించారు. జూలై 2న పాఠశాలకు 14 మంది విద్యార్థుల్లో ఒక్క విద్యార్థి మాత్రమే హాజరైనట్లు అటెండెన్స్ రిజిస్టర్లో నమోదు చేసి, మిగిలిన 13 మందిని గైర్హాజరుగా గుర్తించారు.
అయితే, కృష్ణారావు మధ్యాహ్న భోజన పథకం యాప్లో 14 మంది విద్యార్థులు హాజరైనట్లు నమోదు చేసినట్లు అధికారులు గుర్తించారు. హాజరు వివరాల్లో వ్యత్యాసాలు ఉండటంతో ఉపాధ్యాయులు కృష్ణారావు, విజయ్ భాస్కర్లను సస్పెండ్ చేస్తూ డీఈవో ఆదేశాలు జారీ చేశారు.