BREAKING
నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు దేశభక్తి, ధైర్యసాహసాలకు ప్రతీక అల్లూరి సీతారామరాజు – బొండా ఉమా పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీలో పాల్గొన్న జిల్లా విద్యాశాఖాధికారి ఆధార్ యాప్‌లోనే వివరాలు అప్‌డేట్ వాట్సాప్‌లో ఈ లింక్స్‌పై అస్సలు క్లిక్ చేయొద్దు 32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు 292వ డివిజన్ అధ్యక్షుడిగా హరికిరణ్ నియామకం నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు దేశభక్తి, ధైర్యసాహసాలకు ప్రతీక అల్లూరి సీతారామరాజు – బొండా ఉమా పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీలో పాల్గొన్న జిల్లా విద్యాశాఖాధికారి ఆధార్ యాప్‌లోనే వివరాలు అప్‌డేట్ వాట్సాప్‌లో ఈ లింక్స్‌పై అస్సలు క్లిక్ చేయొద్దు 32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు 292వ డివిజన్ అధ్యక్షుడిగా హరికిరణ్ నియామకం
www.ntodaynews.com

నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు

తెలంగాణ
/ నల్గొండ
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
04 Jul, 2026 - 05:06 PM
12 వీక్షణలు

నల్గొండ, జూలై 4: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నల్గొండలో ఘనంగా నివాళులర్పించారు. దొడ్డి కొమురయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన త్యాగాలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్ మాట్లాడుతూ, దొడ్డి కొమురయ్య త్యాగం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ప్రేరణగా నిలిచిందన్నారు. నైజాం పాలన, రజాకారులు, దొరల అణచివేతకు వ్యతిరేకంగా ప్రజల్లో పోరాట స్ఫూర్తిని రగిలించిన మహనీయుడు దొడ్డి కొమురయ్య అని కొనియాడారు.

ఆంధ్ర మహాసభ స్ఫూర్తితో వెట్టి చాకిరి, దోపిడీ, అణచివేతలకు వ్యతిరేకంగా పోరాడుతూ అతి చిన్న వయసులోనే అమరుడైన దొడ్డి కొమురయ్య ఆశయాలు నేటికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో వేలాది మంది అమరులయ్యారని, లక్షల ఎకరాల భూమి పేదలకు పంచిపెట్టే చారిత్రాత్మక మార్పులకు ఈ ఉద్యమం దోహదపడిందని వివరించారు.

దొడ్డి కొమురయ్య ఆశయాలను కొనసాగిస్తూ విద్యార్థి, యువజన, ప్రజా సమస్యల పరిష్కారం కోసం డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నిరంతరం ఉద్యమాలు కొనసాగిస్తాయని నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నాయకులు గుండాల నరేష్, మారుపాక కిరణ్, ఎండీ అదిల్, కార్లపూడి రాము, గోపి చందు, బాలరాజు, రోహిత్, ముకేశ్, సాయి, హరీష్, మాధవ్ యాదగిరి, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.