www.ntodaynews.com
కొండమడుగు గ్రామంలో ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి
తెలంగాణ
/
యాదాద్రి భువనగిరి
/
బీబీ నగర్
బీబీ మండలం కొండమడుగు గ్రామ శివారులో ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ నిర్మాణ పనులకు భువనగిరి ఎమ్మెల్యే శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
గ్రామాల్లో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణను శాస్త్రీయ పద్ధతిలో చేపట్టడంతో పాటు పరిశుభ్రమైన వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. ప్లాస్టిక్ వ్యర్థాల సక్రమ నిర్వహణ ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటుతో పాటు గ్రామాల్లో పరిశుభ్రత మరింత మెరుగుపడుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీబీ మండల, గ్రామ ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, గ్రామస్థులు, పాల్గొన్నారు.