www.ntodaynews.com
ముంబైలో రెడ్ అలర్ట్.. స్కూళ్లు, కాలేజీలు మూసివేత
అంతర్జాతీయం
అంతర్జాతీయం
గత కొన్ని రోజులుగా ముంబైలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో, భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీనితో బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) విద్యార్థుల భద్రత దృష్ట్యా అన్ని పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని బీఎంసీ హెచ్చరించింది. నగరంలో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయని, కొన్ని ప్రాంతాల్లో వంద మిల్లీమీటర్లకు పైగా నమోదయ్యాయని అధికారులు తెలిపారు.