డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు
మేడ్చల్–మల్కాజిగిరి | NTODAY NEWS
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) ఉపాధ్యక్షుడు శ్రీ కూన శ్రీనివాస్ గౌడ్ గారిని నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు, శుభాకాంక్షలు పొందారు.
ఈ సందర్భంగా కూన శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, పార్టీ నూతన బాధ్యతలు చేపట్టిన అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రతి కార్యకర్తను కలుపుకొని పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకుగా వ్యవహరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆకాంక్షించారు.
నూతన డివిజన్ అధ్యక్షులు మాట్లాడుతూ, పార్టీ అధిష్ఠానం తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుండి పనిచేస్తామని, పార్టీ కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు.
ఈ మర్యాదపూర్వక సమావేశంలో చౌడా శ్రీనివాసరావు, సిహెచ్ బుచ్చిరెడ్డి, నాగిల్ల శ్రీనివాస్, రఘు రెడ్డి, చిలుక, సత్యం, శ్రీనివాసరెడ్డి, బాల్ రెడ్డి, ఉలిపి శ్యామ్, టిల్లు, శ్రీకాంత్, రాజిరెడ్డి, అంజి యాదవ్, వెంకటేష్, గోపాల్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని నూతన అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలిపారు.