స్పీడ్ పోస్ట్ ద్వారా గంజాయి సరఫరా.. జార్ఖండ్ ముఠా గుట్టురట్టు
హైదరాబాద్, జులై 3: హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్-న్యూ) దేశవ్యాప్తంగా స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్వర్క్ను ఛేదించింది. ఈ కేసులో జార్ఖండ్కు చెందిన ప్రధాన సూత్రధారి సత్యం మిశ్రాను పోలీసులు అరెస్టు చేశారు.
దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు వాట్సాప్తో పాటు ఇతర ఆన్లైన్ మాధ్యమాల ద్వారా ఆర్డర్లు స్వీకరించి, యూపీఐ ద్వారా నగదు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. అనంతరం మెడిసిన్ పార్సిల్స్ పేరుతో గంజాయిని స్పీడ్ పోస్ట్ ద్వారా నేరుగా కస్టమర్ల ఇళ్లకు పంపిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ ముఠా కార్యకలాపాలపై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతోందని, ఇందులో భాగమైన ఇతర నిందితులను గుర్తించి అరెస్టు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు హెచ్-న్యూ అధికారులు తెలిపారు.