www.ntodaynews.com
ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత
ఆంధ్రప్రదేశ్
/
అనకాపల్లి
అనకాపల్లి జిల్లా , పాయకరావుపేట నియోజకవర్గంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత పర్యటించారు.పాయకరావుపేట పట్టణంలో పాత పెదిరెడ్డి వారి వీధిలో పింఛన్ లను వర్షంలో సైతం ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు.ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
పాయకరావుపేట వార్డుల్లో పర్యటించిన ఆమె పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.పైడమ్మ అనే ఆమె తో ఆప్యాయంగా మాట్లాడిన అనంతరం పైడమ్మ వద్ద మామిడిపళ్ళు మంత్రి అనిత కొనుగోలు చేశారు.అలాగే
పాయకరావుపేట లో రోడ్డుపక్కన టిఫిన్ షాపు నిర్వాహకురాలతో మాట్లాడారు.ఆ టిఫిన్ షాప్ వద్ద గారెలు తిని బిల్లు చెల్లించారు.
అనంతరం పాయకరావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో నూతన భవనాన్ని ప్రారంభించారు.