BREAKING
పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన కీసర ఎస్ఐ డి జ్ఞానేందర్ రెడ్డికి ముందస్తు రాఖీ శుభాకాంక్షలు తెలిపిన సహచరి ఆర్పీలు హనుమకొండ: కేయూ జంక్షన్ వద్ద ఉద్రిక్తత సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దగ్ధం. పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన కీసర ఎస్ఐ డి జ్ఞానేందర్ రెడ్డికి ముందస్తు రాఖీ శుభాకాంక్షలు తెలిపిన సహచరి ఆర్పీలు హనుమకొండ: కేయూ జంక్షన్ వద్ద ఉద్రిక్తత సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దగ్ధం.
www.ntodaynews.com

అనంతసాగరంలో SIR ప్రక్రియ మందగమనం.. 14 రోజులు గడువు, 20% నమోదు మాత్రమే

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి ప్రభాకరావు చిలకలూరిపేట మండల ప్రతినిధి
01 Jul, 2026 - 12:56 PM
67 వీక్షణలు

అనంతసాగరం | NTODAY NEWS

ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR - Special Intensive Revision) ప్రక్రియలో అనంతసాగరం మండలం ఆశించిన స్థాయిలో పురోగతి సాధించలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రక్రియ పూర్తి కావడానికి కేవలం 14 రోజుల గడువు మాత్రమే మిగిలి ఉండగా, ఇప్పటివరకు సుమారు 20 శాతం నమోదు మాత్రమే పూర్తయినట్లు సమాచారం.

క్షేత్రస్థాయిలో ఇంటింటికీ వెళ్లి గణన సమాచార పత్రాలను పంపిణీ చేయాల్సిన బూత్ లెవల్ అధికారులు (BLOలు) అనేక ప్రాంతాల్లో సచివాలయాలకే పరిమితమయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో గ్రామాల్లోని అనేక మంది ఓటర్లకు గణన పత్రాలు అందలేదని తెలుస్తోంది.

అలాగే, గణన సమాచార పత్రాలను పూర్తి చేసి సిద్ధంగా ఉంచినప్పటికీ వాటిని స్వీకరించేందుకు బీఎల్‌వోలు రావడం లేదని పలువురు ఓటర్లు వాపోతున్నారు. ఈ పరిస్థితి కారణంగా ఓటర్లలో అయోమయం, అసంతృప్తి నెలకొంటున్నట్లు సమాచారం.

ప్రక్రియను పర్యవేక్షించాల్సిన సూపర్వైజర్లు క్షేత్రస్థాయిలో కనిపించడం లేదని, పర్యవేక్షణ లోపం కారణంగా బీఎల్‌వోల పనితీరుపై ప్రభావం పడుతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇటీవల మండల తహసీల్దార్ సమీక్ష నిర్వహించినప్పటికీ క్షేత్రస్థాయిలో ఆశించిన మార్పు కనిపించలేదని స్థానికులు చెబుతున్నారు.

ఓటు హక్కుకు సంబంధించిన అత్యంత కీలకమైన ఈ ప్రక్రియలో నిర్లక్ష్యం కొనసాగితే అర్హులైన ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టి గ్రామాల వారీగా పురోగతిని సమీక్షించి, లోపాలను వెంటనే సరిదిద్దాలని స్థానికులు కోరుతున్నారు.