BREAKING
శ్రీశైల దేవస్థానంలో పదవీ విరమణ చేసిన ఏడుగురు ఉద్యోగులకు ఘన సత్కారం వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎంపీ కేశినేని చిన్ని Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు.. రైతు మహిళలకు పవిత్ర వడ్ల పంపిణీ Nandyal: నేషనల్ హైవే 167K పనులు వేగవంతం.. గాలేరు నదిపై కొత్త వంతెన నిర్మాణం Hyderabad: వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026 విజయవంతం.. Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు శ్రీశైల దేవస్థానంలో పదవీ విరమణ చేసిన ఏడుగురు ఉద్యోగులకు ఘన సత్కారం వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎంపీ కేశినేని చిన్ని Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు.. రైతు మహిళలకు పవిత్ర వడ్ల పంపిణీ Nandyal: నేషనల్ హైవే 167K పనులు వేగవంతం.. గాలేరు నదిపై కొత్త వంతెన నిర్మాణం Hyderabad: వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026 విజయవంతం.. Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు
www.ntodaynews.com

శ్రీశైల దేవస్థానంలో పదవీ విరమణ చేసిన ఏడుగురు ఉద్యోగులకు ఘన సత్కారం

భక్తి భక్తి
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
30 Jun, 2026 - 11:47 PM
23 వీక్షణలు

శ్రీశైలం | NTODAY NEWS

శ్రీశైల దేవస్థానంలో మంగళవారం పదవీ విరమణ చేసిన ఏడుగురు ఉద్యోగులకు ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో ఆత్మీయ సత్కార కార్యక్రమం నిర్వహించారు. దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పదవీ విరమణ చేసిన ఉద్యోగుల సేవలను కొనియాడారు.

ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ, దేవస్థానంలో ఉద్యోగుల హోదాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ అందరూ భగవంతుని సేవలో భాగస్వాములేనని అన్నారు. అంకితభావంతో విధులు నిర్వహించిన ఉద్యోగులు దేవస్థాన అభివృద్ధికి విశేష సేవలు అందించారని ప్రశంసించారు.

ధర్మకర్తల మండలి సభ్యులు చిట్టిబొట్ల భరద్వాజశర్మ మాట్లాడుతూ, దేవస్థానంలో సేవ చేసే అవకాశం ఎన్నో జన్మల పుణ్యఫలమని పేర్కొంటూ పదవీ విరమణ చేసిన ఉద్యోగులను అభినందించారు.

ఈ సందర్భంగా పదవీ విరమణ పొందిన వారిలో ఉపప్రధానార్చకులు సి. యోగేంద్రసాయి (34 ఏళ్ల సేవ), పర్యవేక్షకులు డి. రంగన్న (37 ఏళ్ల సేవ), సీనియర్ అసిస్టెంట్ యం. రామనాయుడు (27 ఏళ్ల సేవ), తోటమాలి బి. రంగన్న (37 ఏళ్ల సేవ), స్వీపర్ ఎస్. భ్రమరాంబ (20 ఏళ్ల సేవ)తో పాటు మరో ఇద్దరు ఉద్యోగులు ఉన్నారు.

కార్యక్రమం ముగింపులో పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు శ్రీస్వామి–అమ్మవార్ల శేషవస్త్రాలు, ప్రసాదాలు, జ్ఞాపికలు అందజేసి దేవస్థానం ఘనంగా సత్కరించింది. దేవస్థాన ఉద్యోగుల సంక్షేమ సంఘం కార్యదర్శి పీ.వి. సుబ్బారెడ్డితో పాటు పలువురు ఉద్యోగులు కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.