BREAKING
రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం
www.ntodaynews.com

కాస్‌గంజ్ జిల్లాలో అత్యవసర ల్యాండింగ్ చేసిన శిక్షణ విమానం.. మహిళా పైలట్‌కు గాయాలు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Jun, 2026 - 09:15 PM
42 వీక్షణలు

ఉత్తరప్రదేశ్‌లోని కాస్‌గంజ్ జిల్లాలో సాంకేతిక లోపంతో ఓ శిక్షణ విమానం హైవే సమీపంలోని పొలంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేసింది.

అలీగఢ్‌కు చెందిన డీజీసీఏ గుర్తింపు పొందిన 'చేతక్ ఏవియేషన్' సంస్థకు చెందిన ‘VT-AFB’ సెస్నా-152 శిక్షణ విమానం సోలో ఫ్లయింగ్ సెషన్‌లో భాగంగా అలీగఢ్ నుంచి గాల్లోకి ఎగిరింది. అయితే ప్రయాణం మధ్యలో విమానంలో అకస్మాత్తుగా సాంకేతిక లోపం తలెత్తడంతో మహిళా ట్రైనీ పైలట్ అప్రమత్తమై ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు ప్రయత్నించింది.

ఈ క్రమంలో విమానం కాస్‌గంజ్ సమీపంలోని పొలంలో క్రాష్ ల్యాండింగ్ చేయగా, విద్యుత్ తీగలను ఢీకొట్టడంతో విమానం ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది.

ఈ ఘటనలో మహిళా ట్రైనీ పైలట్ గాయపడగా, వెంటనే ఆమెను కాస్‌గంజ్ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.

సమాచారం అందుకున్న జిల్లా యంత్రాంగం, పోలీసు అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.