కాస్గంజ్ జిల్లాలో అత్యవసర ల్యాండింగ్ చేసిన శిక్షణ విమానం.. మహిళా పైలట్కు గాయాలు
ఉత్తరప్రదేశ్లోని కాస్గంజ్ జిల్లాలో సాంకేతిక లోపంతో ఓ శిక్షణ విమానం హైవే సమీపంలోని పొలంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేసింది.
అలీగఢ్కు చెందిన డీజీసీఏ గుర్తింపు పొందిన 'చేతక్ ఏవియేషన్' సంస్థకు చెందిన ‘VT-AFB’ సెస్నా-152 శిక్షణ విమానం సోలో ఫ్లయింగ్ సెషన్లో భాగంగా అలీగఢ్ నుంచి గాల్లోకి ఎగిరింది. అయితే ప్రయాణం మధ్యలో విమానంలో అకస్మాత్తుగా సాంకేతిక లోపం తలెత్తడంతో మహిళా ట్రైనీ పైలట్ అప్రమత్తమై ఎమర్జెన్సీ ల్యాండింగ్కు ప్రయత్నించింది.
ఈ క్రమంలో విమానం కాస్గంజ్ సమీపంలోని పొలంలో క్రాష్ ల్యాండింగ్ చేయగా, విద్యుత్ తీగలను ఢీకొట్టడంతో విమానం ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది.
ఈ ఘటనలో మహిళా ట్రైనీ పైలట్ గాయపడగా, వెంటనే ఆమెను కాస్గంజ్ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.
సమాచారం అందుకున్న జిల్లా యంత్రాంగం, పోలీసు అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.