BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

కాస్‌గంజ్ జిల్లాలో అత్యవసర ల్యాండింగ్ చేసిన శిక్షణ విమానం.. మహిళా పైలట్‌కు గాయాలు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Jun, 2026 - 09:15 PM
80 వీక్షణలు

ఉత్తరప్రదేశ్‌లోని కాస్‌గంజ్ జిల్లాలో సాంకేతిక లోపంతో ఓ శిక్షణ విమానం హైవే సమీపంలోని పొలంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేసింది.

అలీగఢ్‌కు చెందిన డీజీసీఏ గుర్తింపు పొందిన 'చేతక్ ఏవియేషన్' సంస్థకు చెందిన ‘VT-AFB’ సెస్నా-152 శిక్షణ విమానం సోలో ఫ్లయింగ్ సెషన్‌లో భాగంగా అలీగఢ్ నుంచి గాల్లోకి ఎగిరింది. అయితే ప్రయాణం మధ్యలో విమానంలో అకస్మాత్తుగా సాంకేతిక లోపం తలెత్తడంతో మహిళా ట్రైనీ పైలట్ అప్రమత్తమై ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు ప్రయత్నించింది.

ఈ క్రమంలో విమానం కాస్‌గంజ్ సమీపంలోని పొలంలో క్రాష్ ల్యాండింగ్ చేయగా, విద్యుత్ తీగలను ఢీకొట్టడంతో విమానం ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది.

ఈ ఘటనలో మహిళా ట్రైనీ పైలట్ గాయపడగా, వెంటనే ఆమెను కాస్‌గంజ్ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.

సమాచారం అందుకున్న జిల్లా యంత్రాంగం, పోలీసు అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.