www.ntodaynews.com
భారత్పై 1,500 కిలోమీటర్ల పొడవైన వర్షమేఘాల బెల్ట్.. ఉత్తరాదికి భారీ వర్షాల హెచ్చరిక
జాతీయం
ఉత్తర బంగాళాఖాతం నుంచి జమ్మూకశ్మీర్ వరకు సుమారు 1,500 కిలోమీటర్ల పొడవునా రుతుపవన ద్రోణి విస్తరించినట్లు ఉపగ్రహ చిత్రాలు వెల్లడించాయి. రుతుపవనాలు దక్షిణ దిశగా కదులుతున్న నేపథ్యంలో ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన విస్తృత వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
గత కొన్ని వారాలుగా తీవ్ర ఎండలు, రుతుపవనాల ఆలస్య రాకతో ఇబ్బందులు ఎదుర్కొన్న ఉత్తర భారత ప్రజలకు ఈ పరిణామం ఊరటనిచ్చే అవకాశముంది. ఈ రుతుపవన ద్రోణి ప్రభావంతో పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్ తదితర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.