BREAKING
పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం
www.ntodaynews.com

Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు.. రైతు మహిళలకు పవిత్ర వడ్ల పంపిణీ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
29 Jun, 2026 - 12:46 PM
80 వీక్షణలు

విజయవాడ | NTODAY NEWS

ఆంధ్రప్రదేశ్ దేవదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ఏరువాక పౌర్ణమి వేడుకలు సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన రైతు భక్త బృందాలకు ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికి, అమ్మవారి ప్రత్యేక దర్శనం కల్పించి వేదాశీర్వచనం, తీర్థ ప్రసాదాలను అందజేశారు.

హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ (HDPT) మహిళా విభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర మహిళా కో-ఆర్డినేటర్ కరి రమాసుందరి నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించారు.

ఏరువాక పౌర్ణమి సందర్భంగా మహిళలు కోట్ల సంఖ్యలో చేసిన రామనామ జపంతో పవిత్రీకరించిన వడ్లను రైతు మహిళలకు పసుపు, కుంకుమతో పాటు సౌభాగ్య కానుకలుగా అందజేశారు. ఈ కార్యక్రమం ద్వారా పాడిపంటలు సమృద్ధిగా పండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

అలాగే భూసూక్తం, నీలాసూక్తం, వరుణసూక్తం పారాయణాలతో ప్రకృతి ఆరాధన చేపట్టి, వ్యవసాయ సీజన్ విజయవంతంగా సాగాలని సంకల్పించారు.

ఈ కార్యక్రమంలో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ మహిళా ప్రతినిధులు, ఆలయ అధికారులు, అర్చకులు, పెద్ద సంఖ్యలో రైతు మహిళలు భక్తిశ్రద్ధలతో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.