కనకదుర్గమ్మ కృపాకటాక్షాలతో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి: నందమూరి రామకృష్ణ బాబు
విజయవాడలోని కనకదుర్గమ్మ అమ్మవారిని నందమూరి రామకృష్ణ బాబు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, ప్రజలు సుఖశాంతులతో జీవించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనలో ఆంధ్రప్రదేశ్కు భారీ స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొన్నారు. భావితరాల పిల్లలకు బంగారు భవిష్యత్తు అందించే దిశగా రాష్ట్రం వేగంగా ముందుకు సాగుతోందని అన్నారు.
అలాగే, వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని, అభివృద్ధి మరియు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని నందమూరి రామకృష్ణ బాబు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో వీరంకి గురుమూర్తి, చెన్నుపాటి గాంధీ, కిలారి చంద్రశేఖర్, వల్లూరి కిరణ్, నరసయ్య, జ్యోతి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.