విద్యార్థుల భవిష్యత్తుకు ఐ సడక్, అబెర్టిస్ సంస్థల అండ
విద్యార్థుల భవిష్యత్తుకు ఐ సడక్, అబెర్టిస్ సంస్థల అండ
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నల్గొండ జిల్లా గట్టుప్పల్ మండలం వెల్మకన్నె జెడ్పీహెచ్ఎస్ పాఠశాలకు ఐ సడక్ సంస్థ, అబెర్టిస్ కంపెనీ ఆధ్వర్యంలో గురువారం సుమారు రూ.4.50 లక్షల విలువైన సామగ్రిని అందజేశారు. సంస్థలు చేపట్టిన సీఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా ఈ సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా పాఠశాలకు 5 కంప్యూటర్లు, ఒక సౌండ్ సిస్టమ్, 108 మంది విద్యార్థులకు ప్యాంట్–టీషర్ట్తో కూడిన స్పోర్ట్స్ డ్రెస్సులు, 108 స్పోర్ట్స్ కిట్లు, క్రీడా సామగ్రిని అందించారు. కంప్యూటర్ల ద్వారా విద్యార్థులకు డిజిటల్ విద్య మరింత చేరువకానుండగా, సౌండ్ సిస్టమ్ పాఠశాల కార్యక్రమాలకు ఉపయోగపడనుంది అని, క్రీడా దుస్తులు, కిట్లు విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని, ఆరోగ్యకరమైన పోటీ భావనను పెంపొందించనున్నాయని పాఠశాల ప్రతినిధులు తెలిపారు. ఈ సహాయం అందించడంలో ప్రత్యేకంగా సహకరించిన రేణుక మేడం, పల్లా శ్రీనివాసరెడ్డిలకు పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం సంస్థలు, సమాజం కలిసి పనిచేస్తే సానుకూల మార్పులు తీసుకురావచ్చని పేర్కొన్నారు. విద్యార్థులకు అందించిన ఈ సహాయం కేవలం వస్తువుల రూపంలో కాకుండా వారి ప్రతిభ, కలలు, భవిష్యత్తును ప్రోత్సహించే గొప్ప ప్రేరణగా నిలుస్తుందని పాఠశాల సిబ్బంది పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఐ సడక్, అబెర్టిస్ సంస్థల ప్రతినిధులకు, రేణుక మేడం, పల్లా శ్రీనివాసరెడ్డికి, కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ పాఠశాల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెలమ కన్య గ్రామ సర్పంచ్ రావుల స్వప్న రమేష్ , ఉప సర్పంచ్ గంగన్న బోయిన మహేష్ , మాజీ ఎంపిటిసి కంపేర్ దుర్గయ్య , గ్రామ పెద్దలు చల్లమల యాదగిరి రెడ్డి , రిజ్వాన , పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్. బి. రాములు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు