గుడివాడ రూరల్ పీఎస్లో బదిలీపై వెళ్తున్న నలుగురు పోలీసులకు ఘన సత్కారం
గుడివాడ: గుడివాడ రూరల్ పోలీస్ స్టేషన్లో ఐదేళ్లపాటు సేవలందించి బదిలీపై వెళ్తున్న నలుగురు పోలీసులకు ఆదివారం ఆత్మీయ వీడ్కోలు పలికారు. స్టేషన్ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్ఐ చంటిబాబు ఆధ్వర్యంలో సహచర పోలీసులు వారిని శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.
బదిలీపై వెళ్తున్న హెడ్ కానిస్టేబుళ్లు కె.శ్రీనివాసరావు (569), ఎస్.వి.వి.నరసింహారావు (644), కె.గోవర్ధన్ (2244), కానిస్టేబుల్ వెంకట రమణ (2749)లను సిబ్బంది అభినందిస్తూ ఆత్మీయంగా వీడ్కోలు పలికారు.
ఈ సందర్భంగా ఎస్ఐ చంటిబాబు మాట్లాడుతూ, "ఇన్నాళ్లు కలిసిమెలిసి పనిచేసిన సహచరులు బదిలీపై వెళ్లడం బాధ కలిగిస్తోంది. అయితే ప్రభుత్వ ఉద్యోగ జీవితంలో బదిలీలు సహజం. ఎక్కడ విధులు నిర్వహించినా దేవుని ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో ఉండి, ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించాలని కోరుకుంటున్నాను" అని అన్నారు.
కార్యక్రమంలో గుడివాడ రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొని బదిలీపై వెళ్తున్న పోలీసు సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.