www.ntodaynews.com
Punganur: గూడూరుపల్లి వద్ద రోడ్డు ప్రమాదం.. ఆటో బోల్తా, ఒకరికి తీవ్ర గాయాలు
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
అన్నమయ్య జిల్లా | NTODAY NEWS
అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం గూడూరుపల్లి గ్రామ సమీపంలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.
స్థానికుల వివరాల ప్రకారం, కాపాడం మిట్టపల్లి గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం షేర్ ఆటోలో ప్రయాణిస్తుండగా, గూడూరుపల్లి సమీపంలో ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో బోల్తా పడగా, సుబ్రహ్మణ్యం తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనపై విచారణ చేపట్టినట్లు సమాచారం.