www.ntodaynews.com
సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు
ఆంధ్రప్రదేశ్
/
గుంటూరు
సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు
గుంటూరు: సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. ఎస్పీ వకుల్ జిందాల్, ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ అలహరి శ్రీనివాస్ సర్దార్ గౌతు లచ్చన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
స్వాతంత్ర్య సమరయోధుడిగా, ప్రముఖ ప్రజా నాయకుడిగా సర్దార్ గౌతు లచ్చన్న రైతులు, కార్మికులు, పేదలు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాడారని డీఎస్పీ పేర్కొన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన ప్రజాసేవా స్ఫూర్తి నేటి తరానికి, ముఖ్యంగా యువతకు ఆదర్శమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏఆర్ ఆర్ఐ కృష్ణయ్య, ఏఆర్ఆర్ఎస్ఐ యేసు రాజు, పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొని సర్దార్ గౌతు లచ్చన్న చిత్రపటానికి నివాళులర్పించారు.