తునికిపాడు పాఠశాలకు దాతల సహకారం
తునికిపాడు పాఠశాలకు దాతల సహకారం
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం తునికిపాడు ప్రాథమిక మెయిన్ పాఠశాలకు దాతలు సహకారం అందించారు.
పాఠశాల అవసరాలను గుర్తించిన దాత నల్లగట్ల రవీంద్ర రూ.5 వేల విలువైన టవర్ స్పీకర్ బాక్స్ను అందజేశారు. మరో దాత, పాఠశాల స్కూల్ పేరెంట్స్ కమిటీ చైర్మన్ నల్లగట్ల ప్రదీప్ 75 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేసేందుకు అవసరమైన స్టీల్ పళ్లెాలు, గ్లాసులను రూ.7 వేల విలువతో అందించారు.
ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ వస్తువులను అందించినట్లు ఉపాధ్యాయులు సోమవారం తెలిపారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంగెపు వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు ఆదూరి వెంకట నరసింహారావు, యలగందుల శ్రీనివాసరావు, పాఠశాల సిబ్బంది, గ్రామ పెద్దలు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల అభివృద్ధికి దాతలు అందిస్తున్న సహకారం అభినందనీయమని పేర్కొన్నారు.