గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, ఐపీఎస్ జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు.
అనంతరం రిజర్వ్ పోలీస్ సిబ్బంది ఎస్పీకి గార్డ్ ఆఫ్ హానర్ సమర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ పోలీస్ అధికారులు, సిబ్బందికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి, మిఠాయిలు పంపిణీ చేశారు.
పోలీస్ కార్యాలయ సిబ్బంది, సీసీ సిబ్బంది, గార్డ్ సిబ్బంది, ఇతర పోలీస్ సిబ్బంది జాతీయ గీతాన్ని ఆలపించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీ రమణమూర్తి, ఎస్బీ డీఎస్పీ శ్రీ అలహరి శ్రీనివాస్, ఏఆర్ డీఎస్పీ శ్రీ సుంకరయ్య, వెల్ఫేర్ ఆర్ఐ శ్రీ సురేష్ బాబు, ఆర్ఐ ఎన్టీ శ్రీహరి రెడ్డి, ఆర్ఐ అడ్మిన్ కృష్ణయ్య, ఆర్ఎస్ఐ బాల శంకర్తో పాటు పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ దేశభక్తి, విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని పోలీస్ సిబ్బందికి సూచించారు. ప్రతి ఒక్కరికీ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.