ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు
నడిపెల్లి దివాకర్ రావు జన్మదినాన్ని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలో బీఆర్ఎస్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
మండల యూత్ ప్రెసిడెంట్ అంకతి గంగాధర్, గ్రామ కమిటీ అధ్యక్షుడు కాండ్రపు శంకరయ్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. అనంతరం లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నడిపెల్లి దివాకర్ రావుకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో నిండిన జీవితం గడపాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ బబ్బేరి సుధాకర్, PACS డైరెక్టర్ కాండ్రపు సత్తయ్య, సీనియర్ నాయకులు బొప్పు లక్ష్మీరాజం, సత్తయ్య గౌడ్, యువకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.