మాగండ్లపల్లి రైతులకు న్యాయం చేయాలని కలెక్టర్కు వినతి..
మాగండ్లపల్లి రైతులకు న్యాయం చేయాలని కలెక్టర్కు వినతి...పుంగనూరు
బీసీవై పార్టీ.
అన్నమయ్య జిల్లా.
అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం మాగండ్లపల్లి రెవెన్యూ గ్రామం – మద్దనపల్లె గ్రామానికి చెందిన 29 మంది రైతుల భూములపై జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ రికార్డుల్లో అవకతవకలు, తప్పుడు పట్టాదారు పాస్ పుస్తకాల జారీపై సమగ్ర విచారణ జరిపి అసలు హక్కుదారులకు న్యాయం చేయాలని కోరుతూ బీసీవై పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి అన్నమయ్య జిల్లా సబ్ కలెక్టర్ శ్రీమతి చల్లా కళ్యాణి ఐఏఎస్ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా బీసీవై పార్టీ నాయకులు మాట్లాడుతూ, రైతుల భూములను కాపాడడం ప్రభుత్వ బాధ్యత అని, అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకొని అసలు హక్కుదారులకు న్యాయం చేయాలని కలెక్టర్ గారిని కోరారు.
వినతిపత్రం అందజేసిన వారిలో:
పాల్ రమేష్ యాదవ్ – PAC సభ్యులు
హరిబాబు యాదవ్ – పుంగనూరు నియోజకవర్గ కన్వీనర్
సాంబమూర్తి – ఎగ్జిక్యూటివ్ మెంబర్
ఉత్తన్న ________ – అన్నమయ్య జిల్లా యూత్ కన్వీనర్
వెంకటేష్ యాదవ్ – పుంగనూరు రూరల్ కన్వీనర్
శంకర. పి– పుంగనూరు నియోజకవర్గ రైతు విభాగం
అలాగే మాగండ్లపల్లి–మద్దనపల్లె గ్రామానికి చెందిన రైతులు, స్థానిక హక్కుదారులు మరియు బీసీవై పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
"రైతు హక్కుల పరిరక్షణే బీసీవై పార్టీ లక్ష్యం – అక్రమాలకు అడ్డుకట్ట వేసి అసలు హక్కుదారులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుంది."
– బీసీవై పార్టీ, అన్నమయ్య జిల్లా