BREAKING
తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
www.ntodaynews.com

జానకి రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన పీవీ సునీల్ కుమార్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Aug, 2026 - 10:24 PM
13 వీక్షణలు

జానకి రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన పీవీ సునీల్ కుమార్

చింతలపూడి: వైఎస్సార్‌సీపీ ఏలూరు జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు, పార్టీకి విశేష సేవలందించిన జానకి రెడ్డి కుటుంబ సభ్యులను ఏపీ రిటైర్డ్ డీజీ పీవీ సునీల్ కుమార్ పరామర్శించారు. జానకి రెడ్డి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

ఈ సందర్భంగా జానకి రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడిన పీవీ సునీల్ కుమార్, జానకి రెడ్డి ప్రజలతో మమేకమై పార్టీకి, సమాజానికి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు.

పేదలు, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలుస్తూ, తనకు సాధ్యమైనంత మేరకు సహాయం అందించేందుకు జానకి రెడ్డి ఎల్లప్పుడూ ముందుండేవారని పేర్కొన్నారు. ఆమె సేవాభావం, ప్రజల పట్ల ఉన్న నిబద్ధత చిరస్మరణీయమని అన్నారు.

జానకి రెడ్డి ఆకస్మిక మృతి కుటుంబ సభ్యులతో పాటు ఆమెను అభిమానించే వారికి తీరని లోటని తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, అవసరమైన సమయంలో అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ఇండియా మిషన్ జిల్లా నాయకులు కాకర్ల సత్యం, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని జానకి రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు.