తమ్మన శ్రీనివాస్పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు
ఆలమూరు మండల అధ్యక్షులు తమ్మన శ్రీనివాస్పై అక్రమ కేసులు పెట్టడం కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు: చిర్ల జగ్గిరెడ్డి
బ్రిడ్జిల విషయంలో ప్రశ్నించినందుకే తమ్మన శ్రీనివాస్పై అక్రమ కేసులా
14 రోజుల రిమాండ్తో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు
ఆలమూరు మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తమ్మన శ్రీనివాస్పై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి 14 రోజుల రిమాండ్కు తరలించడాన్ని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి తీవ్రంగా ఖండించారు ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తూ స్థానిక ప్రజల అభిప్రాయాల కోసం పోరాడుతున్న తమ్మన శ్రీనివాస్ను రాజకీయంగా ఎదుర్కోలేకనే తప్పుడు కేసులతో వేధింపులకు గురిచేస్తున్నారు అని అన్నారు
మూలస్థానం,బడుగువానిలంక గ్రామాల బ్రిడ్జిలు గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మోడరైజేషన్ గ్రాంట్ లో మంజూరయ్యాయి. అప్పటి శాసనసభ్యులు బిక్కిన కృష్ణార్జున చౌదరి గారి సమయంలో శంకుస్థాపన కార్యక్రమం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం ఆ బ్రిడ్జిలకు సంబంధించిన క్రెడిట్ చోరీలో భాగంగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆ బ్రిడ్జిలకు తమ సొంత పేరు పెట్టాలని అధికారులపై ఒత్తిడి తెచ్చారు కానీ అధికారికంగా ఎటువంటి పరిమిషన్లు లేవుఅయితే స్థానిక గ్రామస్తులు తమ గ్రామ దేవతల పేర్లను బ్రిడ్జిలకు పెట్టాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో తమ్మన శ్రీనివాస్ ప్రజల తరఫున ప్రశ్నించారు. ఈ అంశంలో ఆయన పోషించిన ప్రజా పాత్రను సహించలేక కూటమి ప్రభుత్వం ఆయనపై తప్పుడు కేసులు నమోదు చేసి అరెస్టు చేయించడం రాజకీయ కక్ష సాధింపులో భాగం అని ఆయన అన్నారువైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలను కూటమి ప్రభుత్వం తక్షణమే నిలిపివేయాలని, ప్రజల హక్కులు, గ్రామాల ప్రయోజనాలు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రజల పక్షాన నిలబడి పోరాడుతుందని స్పష్టం చేశారు.