RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు
NTODAY NEWS: పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆర్టీసీ డిపోలో విజయవాడ, గుంటూరు వెళ్లే బస్సులు సరిపడా లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు మరియు నిత్య ప్రయాణికులు గంటల తరబడి బస్సుల కోసం వేచి ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇతర డిపోల నుంచి వచ్చే బస్సుల కోసం ఎక్కువసేపు నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. బస్సులు వచ్చిన తర్వాత కూడా కూర్చునేందుకు సీట్లు లేకపోవడంతో పాటు నిలబడేందుకు కూడా స్థలం లేకపోయినా, తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణికులు నిలబడి ప్రయాణం కొనసాగిస్తున్నారు.
రోజురోజుకూ ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో చిలకలూరిపేట నుంచి విజయవాడ, గుంటూరు మార్గాల్లో అదనపు బస్సు సర్వీసులను వెంటనే ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు, ప్రయాణికులు ఆర్టీసీ అధికారులను కోరుతున్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.