MRPS: కొండమడుగులో గోటు విలేజ్ కార్యక్రమం.. విద్య, రిజర్వేషన్ల సద్వినియోగంపై నాయకుల పిలుపు
యాదాద్రి భువనగిరి | NTODAY NEWS
యాదాద్రి భువనగిరి జిల్లా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్పీఎస్) ఆధ్వర్యంలో బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామంలో 'గోటు విలేజ్' కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ శాఖ అధ్యక్షుడు కాడిగళ్ల బాబురావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు దుబ్బ రామకృష్ణ, బీబీనగర్ మండల ఇన్చార్జ్, రాష్ట్ర కార్యదర్శి ఇటికల దేవేందర్, మండల అధ్యక్షుడు పొట్ట వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలులోకి వచ్చిన నేపథ్యంలో అక్షరాస్యతను పెంపొందించి, ప్రతి కుటుంబంలో పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగాలు, రాజ్యాధికార అవకాశాలను సాధించే దిశగా రిజర్వేషన్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అలాగే ఎంఆర్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో చిన్నగల్ల అశోక్, మంద భాస్కర్, బొడ్డు హరిశంకర్, చిన్నగల్ల లింగస్వామి, చిన్నగల్ల గణేష్, చిన్నగల్ల లక్ష్మీనారాయణ, చిన్నగల్ల రాము, శివగల్ల మహేష్, కాడిగళ్ల భార్గవ్, మంద శివ, కాడిగళ్ల శివ, ఎరుపుల వేణు, శివగల్ల బన్నీ, విద్యార్థులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.