BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిర విరాళాల అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలి: సీపీఐ(ఎంఎల్) లిబరేషన్

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Jun, 2026 - 07:06 PM
137 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా, విసన్నపేట | NTODAY NEWS

ఎన్టీఆర్ జిల్లా విసన్నపేటలో నిర్వహించిన పత్రికా సమావేశంలో సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి. హరినాథ్ అయోధ్య బాలరాముడి ఆలయంలో భక్తులు సమర్పించిన నగలు, విరాళాల అక్రమాల ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టి, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అయోధ్య రామమందిర నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసినప్పటికీ, శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌కు చెందిన కొందరు వ్యక్తులపై భక్తులు సమర్పించిన ఆభరణాలు, విరాళాల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణలు హిందూ భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని అన్నారు.

తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లు అయోధ్య ఘటనపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

సిట్ దర్యాప్తులో కోట్ల రూపాయల విలువైన ఆభరణాలు, నగదు అక్రమాలకు గురైనట్లు వెల్లడైందని, పలువురిని అరెస్టు చేసి కొంత మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయని పేర్కొన్నారు. అయితే అసలు బాధ్యులను కాపాడుతూ కింది స్థాయి అధికారులపై చర్యలు తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని అన్నారు.

అయోధ్యలో సీసీటీవీ పర్యవేక్షణలో లోపాలు ఉండటం కూడా అనుమానాలకు తావిస్తోందని, ఈ మొత్తం వ్యవహారంపై నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డి. హరినాథ్ డిమాండ్ చేశారు.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న అక్రమాలకు సంబంధించిన అంశాలు సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ నాయకుడు డి. హరినాథ్ పత్రికా సమావేశంలో చేసిన ఆరోపణలు మరియు వ్యాఖ్యల ఆధారంగా ప్రచురించబడుతున్నాయి. సంబంధిత ఆరోపణలపై అధికారిక విచారణ వివరాలు వెలువడాల్సి ఉంది.