Tribute: బూబత్తుల నరసింహ దశదిన కర్మలో పాల్గొన్న టీడీపీ నాయకులు.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి
ఏలూరు జిల్లా | NTODAY NEWS
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పర్వతాపురం గ్రామంలో టీడీపీ నాయకుడు, చాట్రాయి మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ బూబత్తుల చెన్నారావు తండ్రి బూబత్తుల నరసింహ దశదిన కర్మ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి చాట్రాయి మండల టీడీపీ అధ్యక్షుడు ఇజ్జిగాని వెంకటేశ్వరరావు, పర్వతాపురం గ్రామ టీడీపీ మాజీ అధ్యక్షుడు బొర్రా నాగేశ్వరరావు, చిన్నంపేట గ్రామ టీడీపీ అధ్యక్షుడు కందుకూరి అప్పారావు, చాట్రాయి మండల బీసీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ భయగాని కళ్యాణ్రావు, గౌడ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరీదు శివరామకృష్ణ, చాట్రాయి మండల గౌడ సంఘం అధ్యక్షుడు, కృష్ణారావుపాలెం ఎంపీటీసీ చింతగుంట్ల వెంకటేశ్వరరావు, యువజన అధ్యక్షుడు అనిల్ గౌడ్, సాయి కృష్ణ, సాయి గౌడ్, గ్రామ పెద్దలు మిద్దె సత్యనారాయణ (అడవి సత్యం), మిద్దె చెన్నకేశవులు, మిద్దె బుల్లియ, బైగాని మల్లికార్జునరావు, భయగాని కళ్యాణ్తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు, గ్రామస్తులు బూబత్తుల నరసింహ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బూబత్తుల చెన్నారావు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
బూబత్తుల నరసింహ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన నాయకులు, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.