Karumuri Sunil: కారుమూరి సునీల్ త్వరగా విడుదల కావాలని ప్రత్యేక ప్రార్థనలు.. మోకాళ్లపై నడిచి మొక్కు చెల్లించిన మిధున్ చక్రవర్తి
ఏలూరు | NTODAY NEWS
ఏలూరు పార్లమెంట్ ఇన్చార్జ్ కారుమూరి సునీల్ను కూటమి ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసిందని పేర్కొంటూ, ఆయన త్వరగా జైలు నుంచి విడుదల కావాలని గౌరీపట్నంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించినట్లు మిధున్ చక్రవర్తి తెలిపారు.
ఈ సందర్భంగా కారుమూరి సునీల్కు సంఘీభావం తెలియజేస్తూ, కొండపై ఉన్న ప్రార్థనా స్థలం వరకు మోకాళ్లపై నడిచి మొక్కు చెల్లించినట్లు వెల్లడించారు. దేవుని ఆశీస్సులతో సునీల్ త్వరగా విడుదలై ప్రజల మధ్యకు రావాలని ప్రార్థించినట్లు చెప్పారు.
అలాగే కారుమూరి సునీల్ జైలు నుంచి విడుదలైన అనంతరం కృతజ్ఞతగా మరోసారి ఇదే విధంగా మోకాళ్లపై నడిచి దేవునికి మొక్కు తీర్చుకుంటానని ఆయన సన్నిధిలో సంకల్పం చేసినట్లు మిధున్ చక్రవర్తి పేర్కొన్నారు.
కారుమూరి సునీల్ త్వరగా విడుదలై ప్రజాసేవను కొనసాగించాలని దేవుడిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు