BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

పండరీపురంలో భారీ చోరీ.. ఇంటి తాళాలు పగలగొట్టి అపహరణ

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 Aug, 2026 - 05:57 AM
23 వీక్షణలు

పండరీపురంలో భారీ చోరీ.. ఇంటి తాళాలు పగులగొట్టి నగదు, బంగారం అపహరణ

చిలకలూరిపేట: తాళం వేసి ఉన్న ఇంటిని గుర్తించిన దుండగులు అదును చూసుకుని చోరీకి పాల్పడ్డారు. చిలకలూరిపేట పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పండరీపురం 9వ లైనులో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. పండరీపురం 9వ లైనులో కొమ్మబోయిన వెంకట శివరావు (64) తన భార్యతో కలిసి నివాసం ఉంటున్నారు. ఈ నెల 1న దంపతులు హుబ్లీలో నివసిస్తున్న తమ కుమారుడి వద్దకు వెళ్లారు. దీంతో ఇంటికి తాళం వేసి ఉండగా, గురువారం రాత్రి ఇంట్లో లైట్లు వెలుగుతుండటాన్ని ఇరుగుపొరుగు వారు గమనించారు. అనుమానం వచ్చి ఇంటి వద్దకు వెళ్లి పరిశీలించగా చోరీ జరిగిన విషయం బయటపడింది.

దుండగులు ఇంటి మెయిన్‌ గేటుకు ఉన్న తాళాన్ని మాత్రం అలాగే ఉంచి, ప్రధాన ద్వారం తాళాన్ని పగులగొట్టి లోపలికి ప్రవేశించినట్లు గుర్తించారు. అనంతరం బీరువాలో ఉన్న సుమారు 2 సవర్ల బంగారు ఆభరణాలు, కిలో వెండి వస్తువులు, రూ.లక్ష నగదును అపహరించినట్లు బాధితులు తెలిపారు.

ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని ముందుగానే గుర్తించిన దుండగులే ఈ చోరీకి పాల్పడి ఉండొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన ఆగస్టు 11 లేదా 12 తేదీల మధ్య జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఇంటిని పరిశీలించారు. బాధితులు, ఇరుగుపొరుగు వారిని అడిగి వివరాలు సేకరించారు. చోరీ జరిగిన తీరును బట్టి ఆధారాలను సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. కేసు నమోదు చేసి దుండగుల ఆచూకీ కోసం దర్యాప్తు చేపట్టారు.