PGRS: అనంతపురం జిల్లా పోలీసు ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు.. ఎస్పీ కీలక ప్రకటన
అనంతపురం | NTODAY NEWS
అనంతపురం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమం ఈ నెల 29న నిర్వహించబడదని జిల్లా ఎస్పీ పి. జగదీష్, ఐపీఎస్ తెలిపారు.
గౌరవ భారత రాష్ట్రపతి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ జూలై 1న బుక్కరాయసముద్రం మండలంలోని కేంద్ర విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరుకానున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు, ముందస్తు సమన్వయ సమావేశాల్లో జిల్లా పోలీసు అధికారులు నిమగ్నమై ఉన్నారని ఎస్పీ వెల్లడించారు.
ఈ కారణంగా జూన్ 29న నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి ఆ రోజు అర్జీలు సమర్పించేందుకు జిల్లా పోలీసు కార్యాలయానికి రావద్దని విజ్ఞప్తి చేశారు.
పోలీసు శాఖ చేపట్టే తదుపరి ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమానికి సంబంధించిన వివరాలను అనంతరం వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.