Police News: రాష్ట్ర డీజీపీని మర్యాదపూర్వకంగా కలిసిన అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి
అన్నమయ్య జిల్లా | జూన్ 28 | NTODAY NEWS
చిత్తూరులో నిర్వహించిన ఉన్నతస్థాయి పోలీసు సమీక్ష సమావేశంలో అన్నమయ్య జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) ధీరజ్ కునుబిల్లి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డీజీపీ) హరీష్ కుమార్ గుప్తాను మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేశారు.
అనంతరం జరిగిన సమీక్ష సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజా భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, సమర్థవంతమైన మరియు పారదర్శకమైన పోలీసింగ్ సేవలపై అధికారులు చర్చించారు.
ఈ సందర్భంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించడంతో పాటు శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ సమర్థవంతమైన పోలీసింగ్ను కొనసాగించాలని సూచించారు.