BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

కుప్పంలో పౌర హక్కుల దినోత్సవం.. దళితుల సమస్యలపై అధికారుల సమీక్ష

ఆంధ్రప్రదేశ్
Reporter
M. రాజశేఖర్ కుప్పం రూరల్ రిపోర్టర్
30 Jun, 2026 - 10:03 PM
41 వీక్షణలు

కుప్పం | NTODAY NEWS

కుప్పం మండలంలోని మంకలదొడ్డి దళితవాడలో మంగళవారం తహసీల్దార్ రమేష్‌బాబు అధ్యక్షతన పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా దళితుల సామాజిక, ఆర్థిక, భూ సంబంధిత సమస్యలను అధికారులు తెలుసుకుని వాటిపై చర్చించారు.

సమావేశంలో పాల్గొన్న ఎంపీ ప్రకాష్ మాట్లాడుతూ, రాజ్యాంగం దళితులకు కల్పించిన హక్కులు క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో అమలు కావడం లేదన్నారు. ముఖ్యంగా భూముల సమస్యలు, కుల వివక్ష, సంక్షేమ పథకాల అమలులో ఉన్న లోపాలను వెంటనే పరిష్కరించాలని అధికారులను కోరారు.

సమావేశం అనంతరం తహసీల్దార్ రమేష్‌బాబు, రెవెన్యూ అధికారులు సంబంధిత భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవ పరిస్థితులను తెలుసుకున్నారు. భూ రికార్డులను సమగ్రంగా పరిశీలించి, నిబంధనల ప్రకారం అర్హులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

దళితులకు రాజ్యాంగం కల్పించిన పౌర హక్కులను పరిరక్షించడం ప్రభుత్వ యంత్రాంగం బాధ్యత అని అధికారులు పేర్కొన్నారు. కుల వివక్షకు ఎట్టి పరిస్థితుల్లోనూ తావు లేకుండా చట్టాలను కఠినంగా అమలు చేయాలని, పేద దళిత కుటుంబాలకు పూర్తి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని దళిత ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ అధికారులు, పోలీసు శాఖ అధికారులు, దళిత సంఘాల ప్రతినిధులు, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.