BREAKING
వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎంపీ కేశినేని చిన్ని Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు.. రైతు మహిళలకు పవిత్ర వడ్ల పంపిణీ Nandyal: నేషనల్ హైవే 167K పనులు వేగవంతం.. గాలేరు నదిపై కొత్త వంతెన నిర్మాణం Hyderabad: వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026 విజయవంతం.. Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు Health: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.. వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎంపీ కేశినేని చిన్ని Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు.. రైతు మహిళలకు పవిత్ర వడ్ల పంపిణీ Nandyal: నేషనల్ హైవే 167K పనులు వేగవంతం.. గాలేరు నదిపై కొత్త వంతెన నిర్మాణం Hyderabad: వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026 విజయవంతం.. Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు Health: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి..
www.ntodaynews.com

ముంబై ఆస్పత్రిలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. భుజాలకు శస్త్రచికిత్స అవసరమన్న వైద్యులు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Jun, 2026 - 08:02 PM
14 వీక్షణలు

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొంతకాలంగా భుజాలకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు. రెండు భుజాల్లోని కండరాలు పూర్తిగా చిట్లిపోవడంతో పాటు రొటేటర్ కఫ్ గాయం కారణంగా ఆయన తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.

ఈ నేపథ్యంలో ఆరోగ్య పరీక్షల కోసం ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిని పవన్ కళ్యాణ్ సందర్శించారు. ఆయనతో పాటు సతీమణి అన్నా లెజ్నేవా కూడా ముంబై వెళ్లారు.

పవన్ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్యులు రెండు భుజాల్లో గాయాల తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. వెంటనే శస్త్రచికిత్స చేయించుకోవాలని, అనంతరం కొంతకాలం పూర్తిస్థాయిలో విశ్రాంతి తీసుకోవడం అవసరమని సూచించారు.

అయితే ప్రస్తుతం తనకు అధికారిక కార్యక్రమాలు ఉన్నాయని, వాటిని పూర్తి చేసిన తర్వాత మళ్లీ ముంబై వచ్చి చికిత్స చేయించుకుంటానని పవన్ కళ్యాణ్ వైద్యులకు తెలిపినట్లు సమాచారం. అధికారిక కార్యక్రమాలు ముగిసిన అనంతరం ఆయన మరికొన్ని రోజుల్లో ముంబై వెళ్లి శస్త్రచికిత్స చేయించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.