BREAKING
శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి
www.ntodaynews.com

ముంబై ఆస్పత్రిలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. భుజాలకు శస్త్రచికిత్స అవసరమన్న వైద్యులు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Jun, 2026 - 08:02 PM
80 వీక్షణలు

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొంతకాలంగా భుజాలకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు. రెండు భుజాల్లోని కండరాలు పూర్తిగా చిట్లిపోవడంతో పాటు రొటేటర్ కఫ్ గాయం కారణంగా ఆయన తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.

ఈ నేపథ్యంలో ఆరోగ్య పరీక్షల కోసం ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిని పవన్ కళ్యాణ్ సందర్శించారు. ఆయనతో పాటు సతీమణి అన్నా లెజ్నేవా కూడా ముంబై వెళ్లారు.

పవన్ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్యులు రెండు భుజాల్లో గాయాల తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. వెంటనే శస్త్రచికిత్స చేయించుకోవాలని, అనంతరం కొంతకాలం పూర్తిస్థాయిలో విశ్రాంతి తీసుకోవడం అవసరమని సూచించారు.

అయితే ప్రస్తుతం తనకు అధికారిక కార్యక్రమాలు ఉన్నాయని, వాటిని పూర్తి చేసిన తర్వాత మళ్లీ ముంబై వచ్చి చికిత్స చేయించుకుంటానని పవన్ కళ్యాణ్ వైద్యులకు తెలిపినట్లు సమాచారం. అధికారిక కార్యక్రమాలు ముగిసిన అనంతరం ఆయన మరికొన్ని రోజుల్లో ముంబై వెళ్లి శస్త్రచికిత్స చేయించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.