నందిగామ వద్ద రోడ్డు ప్రమాదం.. ఆయిల్ ట్యాంకర్ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై నందిగామ సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. భీమవరం నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టైర్ ఒక్కసారిగా పేలిపోవడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు.
దీంతో బస్సు ముందుగా డివైడర్ను ఢీకొట్టి, అనంతరం అక్కడే ఆగి ఉన్న ఆయిల్ ట్యాంకర్ను బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 46 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులు గాయపడగా, వారిని వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంతో జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడగా, పోలీసులు ట్రాఫిక్ను పునరుద్ధరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.