BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

ఏపీ పౌరసరఫరాల శాఖలో ప్రత్యేక విజిలెన్స్ బృందం.. రాష్ట్రవ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలకు సిద్ధం

ఆంధ్రప్రదేశ్
/ ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Jun, 2026 - 07:09 PM
32 వీక్షణలు

అమరావతి:

ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖలో పారదర్శకత పెంపు, అక్రమాలకు అడ్డుకట్ట వేయడం లక్ష్యంగా ప్రత్యేక విజిలెన్స్ బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించేందుకు 12 మంది అధికారులతో ప్రత్యేక కమిటీని నియమించింది.

ఈ విజిలెన్స్ బృందం ధాన్యం కొనుగోళ్లు, సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) డెలివరీలపై ప్రత్యేక నిఘా ఉంచనుంది. రైతుల నుంచి ధాన్యం సేకరణలో ఎలాంటి అవకతవకలు జరుగుతున్నాయా, మిల్లర్ల నుంచి ప్రభుత్వానికి అందాల్సిన బియ్యం సకాలంలో అందుతోందా అనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలించనుంది.

అలాగే రేషన్ దుకాణాలు, పీడీఎస్ స్టాక్ పాయింట్లు, ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీలు, పెట్రోల్ బంకులపై ఆకస్మిక తనిఖీలు చేపట్టనుంది. ప్రజలకు అందాల్సిన నిత్యావసర సరుకులు సక్రమంగా పంపిణీ అవుతున్నాయా, అక్రమ నిల్వలు లేదా మళ్లింపులు జరుగుతున్నాయా అనే అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనుంది.

ప్రభుత్వం అమలు చేస్తున్న దీపం-2 పథకం, అంగన్‌వాడీ కేంద్రాలు, విద్యార్థి హాస్టళ్లు, మధ్యాహ్న భోజన పథకం అమలుపైనా విజిలెన్స్ బృందం నిఘా ఉంచనుంది. ఆయా పథకాల కింద సరుకుల సరఫరా, వినియోగం, పంపిణీ విధానాలను పరిశీలించి లోపాలను గుర్తించనుంది.

తనిఖీల్లో బయటపడే అవకతవకలు, నిబంధనల ఉల్లంఘనలు, అక్రమాలపై సమగ్ర నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ప్రత్యేక విజిలెన్స్ బృందం సమర్పించనుంది. ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశ్యమని అధికారులు తెలిపారు.