BREAKING
శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి
www.ntodaynews.com

మహేష్ బాబు AMB సినిమాస్‌తో పాటు మరో ఐదు థియేటర్లకు భారీ జరిమానా

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Jun, 2026 - 08:02 PM
73 వీక్షణలు

సినిమా టికెట్లపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తగ్గించినప్పటికీ, టికెట్ల గ్రాస్ రేట్లను పెంచి ప్రేక్షకుల నుంచి అదనపు మొత్తాన్ని వసూలు చేశారన్న ఆరోపణలపై హీరో మహేష్ బాబుకు చెందిన AMB సినిమాస్‌తో పాటు మరో ఐదు థియేటర్లపై జీఎస్టీ అప్పీలేట్ ట్రిబ్యునల్ (GSTAT) జరిమానాలు విధించింది.

ఈ కేసులో AMB సినిమాస్‌కు మొత్తం రూ.1.7 కోట్ల బకాయిలు ఉన్నట్లు ట్రిబ్యునల్ పేర్కొంది. ఇందులో తొలి విడతగా రూ.35 లక్షలను వెంటనే జమ చేయాలని ఆదేశించింది. అలాగే మిగిలిన మొత్తాన్ని నిబంధనల ప్రకారం చెల్లించాలని సూచించింది.

ఇతర థియేటర్లకు విధించిన జరిమానాలు ఇలా ఉన్నాయి..

జ్యోతి థియేటర్ – రూ.19.8 లక్షలు

భ్రమరాంబ సినిమాస్ – రూ.11.8 లక్షలు

కుమార్ 70MM – రూ.2.5 లక్షలు

ASR సినిమాస్ – రూ.9.6 లక్షలు

విశ్వనాథ్ 70MM – రూ.9 లక్షలు

ఈ మొత్తాలకు అదనంగా 18 శాతం వడ్డీని కలిపి సంబంధిత సంక్షేమ నిధికి చెల్లించాలని GSTAT ఆదేశాలు జారీ చేసింది.

జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను వినియోగదారులకు అందించకుండా, టికెట్ ధరలను పెంచి అదనపు వసూళ్లకు పాల్పడిన థియేటర్లపై ఈ చర్యలు తీసుకున్నట్లు ట్రిబ్యునల్ స్పష్టం చేసింది.