చుక్కారామయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో గిరిజన గురుకుల పాఠశాలకు ఫ్యాన్ల పంపిణీ
జనగామ జిల్లా: పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినుల సౌకర్యార్థం డాక్టర్ చుక్కారామయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10 ఫ్యాన్లను అందజేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాచర్ల స్వరూప, ఉప సర్పంచ్ గుగ్గిళ్ల కళ్యాణ్, ఫౌండేషన్ అధ్యక్షుడు మాచర్ల పుల్లయ్య పాల్గొని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అసిఫాకు ఫ్యాన్లను అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాచర్ల స్వరూప మాట్లాడుతూ, డాక్టర్ చుక్కారామయ్య ఫౌండేషన్ గ్రామంలో విద్య, సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ విద్యార్థులకు అండగా నిలుస్తోందని, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత మందికి ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. ఫౌండేషన్ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో 10వ వార్డు సభ్యుడు చెరుపల్లి కుమారస్వామి, ఫౌండేషన్ సభ్యులు లింగంపల్లి రామస్వామి, చిక్కుడు రాములు, అనుముల మహేందర్, బెల్లి సంపత్, పులి కొమురెల్లి, పాఠశాల ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.