BREAKING
సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం
www.ntodaynews.com

రైతు ఆశీర్వాద సభ కాదు.. రైతు వంచన సభ: హరీష్ రావు

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Jun, 2026 - 08:19 PM
32 వీక్షణలు

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన రైతు ఆశీర్వాద సభపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ఇది రైతు ఆశీర్వాద సభ కాదని, రైతు వంచన సభ అని వ్యాఖ్యానించారు.

ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఎకరానికి రూ.15 వేల ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చిందని, కానీ రైతులకు రూ.12 వేలే ఇచ్చిందని ఆరోపించారు. అందులోనూ ఒక పంట సీజన్‌కు సంబంధించిన సాయాన్ని పూర్తిగా ఎగ్గొట్టారని విమర్శించారు.

కొన్ని సందర్భాల్లో రెండు ఎకరాల వరకే, మరికొన్ని సందర్భాల్లో మూడు ఎకరాల వరకే రైతు భరోసా పరిమితం చేశారని హరీష్ రావు పేర్కొన్నారు. రైతులకు ఇవ్వాల్సిన మొత్తాన్ని పూర్తిగా చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు పేరిట రైతులకు మొత్తం రూ.29,300 కోట్ల మేర బాకీ పడిందని హరీష్ రావు ఆరోపించారు. రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి, పెండింగ్ బకాయిలను చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.