BREAKING
శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి
www.ntodaynews.com

రైతు ఆశీర్వాద సభ కాదు.. రైతు వంచన సభ: హరీష్ రావు

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Jun, 2026 - 08:19 PM
66 వీక్షణలు

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన రైతు ఆశీర్వాద సభపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ఇది రైతు ఆశీర్వాద సభ కాదని, రైతు వంచన సభ అని వ్యాఖ్యానించారు.

ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఎకరానికి రూ.15 వేల ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చిందని, కానీ రైతులకు రూ.12 వేలే ఇచ్చిందని ఆరోపించారు. అందులోనూ ఒక పంట సీజన్‌కు సంబంధించిన సాయాన్ని పూర్తిగా ఎగ్గొట్టారని విమర్శించారు.

కొన్ని సందర్భాల్లో రెండు ఎకరాల వరకే, మరికొన్ని సందర్భాల్లో మూడు ఎకరాల వరకే రైతు భరోసా పరిమితం చేశారని హరీష్ రావు పేర్కొన్నారు. రైతులకు ఇవ్వాల్సిన మొత్తాన్ని పూర్తిగా చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు పేరిట రైతులకు మొత్తం రూ.29,300 కోట్ల మేర బాకీ పడిందని హరీష్ రావు ఆరోపించారు. రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి, పెండింగ్ బకాయిలను చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.