BREAKING
శ్రీశైలం మల్లన్న స్వామికి వెండి నాగాభరణం సమర్పణ శ్రీశైలంలో వీరశైవ ఆగమ పాఠశాల ప్రవేశ పరీక్ష నిర్వహణ శ్రీశైలంలో కొనసాగుతున్న యోగా శిక్షణా కార్యక్రమాలు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగ నాయకుడి వాలీమా వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రి పట్టణంలో వాహనాల తనిఖీలు నిర్వహించిన అర్బన్ ఎస్ఐ హజరత్తయ్య నియోజకవర్గ ఆర్థికాభివృద్ధికి ఆటోనగర్ కేంద్రబిందువు కావాలి : ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పెరిగిన ధరలపై చిలకలూరిపేటలో ప్రజాసంఘాల ధర్నా తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక డీఈఓ ను సస్పెండ్ చేయాలి. ఏఎస్ఐ రమేష్ నడుపుతున్న కారు ఢీకొని యువకుడు మృతి శ్రీశైలం మల్లన్న స్వామికి వెండి నాగాభరణం సమర్పణ శ్రీశైలంలో వీరశైవ ఆగమ పాఠశాల ప్రవేశ పరీక్ష నిర్వహణ శ్రీశైలంలో కొనసాగుతున్న యోగా శిక్షణా కార్యక్రమాలు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగ నాయకుడి వాలీమా వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రి పట్టణంలో వాహనాల తనిఖీలు నిర్వహించిన అర్బన్ ఎస్ఐ హజరత్తయ్య నియోజకవర్గ ఆర్థికాభివృద్ధికి ఆటోనగర్ కేంద్రబిందువు కావాలి : ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పెరిగిన ధరలపై చిలకలూరిపేటలో ప్రజాసంఘాల ధర్నా తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక డీఈఓ ను సస్పెండ్ చేయాలి. ఏఎస్ఐ రమేష్ నడుపుతున్న కారు ఢీకొని యువకుడు మృతి
www.ntodaynews.com

శ్రీశైలం సుబ్రహ్మణ్యం స్వామి వారికి విశేష అభిషేకం మరియు పూజలు

భక్తి భక్తి
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
10 Jun, 2026 - 06:56 AM
11 వీక్షణలు

శ్రీశైలంలో శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారికి విశేష అభిషేకం

శ్రీశైలం, జూన్ 9: లోకకల్యాణం కోసం శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం ఆలయ ప్రాంగణంలోని శ్రీశైల దేవస్థానంలో శ్రీ సుబ్రహ్మణ్యస్వామి (కుమారస్వామి) వారికి విశేష అభిషేకం, పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.

ప్రతి మంగళవారం, కృత్తికా నక్షత్రం మరియు షష్ఠి తిథి రోజుల్లో దేవస్థానం సేవగా (సర్కారీ సేవగా) ఈ విశేష అభిషేకం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

అర్చక స్వాములు దేశంలో శాంతి, సౌభాగ్యాలు నెలకొనాలని, సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలకు ఆయురారోగ్యాలు కలగాలని, ప్రకృతి వైపరీత్యాలు, అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు జరగకుండా ఉండాలని సంకల్పం చేశారు.

ముందుగా మహాగణపతి పూజ నిర్వహించి, అనంతరం శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారికి పంచామృతాభిషేకం, అర్చన, సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణలు నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, వివిధ పండ్ల రసాలతో అభిషేకం జరిపారు.

సుబ్రహ్మణ్యస్వామిని భక్తితో ఆరాధించడం వల్ల ఉద్యోగ, వ్యాపార, వ్యవహారాలలో ఆటంకాలు తొలగి విజయాలు సిద్ధిస్తాయని, శత్రుబాధలు, గ్రహపీడలు, దృష్టిదోషాలు తొలగిపోతాయని, సంతానం కోసం ప్రార్థించే వారికి సంతాన భాగ్యం కలుగుతుందని ఆగమ శాస్త్రాలు పేర్కొంటున్నాయి.

ఈ కార్యక్రమం దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆదేశాల మేరకు నిర్వహించబడింది.