BREAKING
పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి
www.ntodaynews.com

శ్రీశైలం సుబ్రహ్మణ్యం స్వామి వారికి విశేష అభిషేకం మరియు పూజలు

భక్తి భక్తి
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
10 Jun, 2026 - 06:56 AM
87 వీక్షణలు

శ్రీశైలంలో శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారికి విశేష అభిషేకం

శ్రీశైలం, జూన్ 9: లోకకల్యాణం కోసం శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం ఆలయ ప్రాంగణంలోని శ్రీశైల దేవస్థానంలో శ్రీ సుబ్రహ్మణ్యస్వామి (కుమారస్వామి) వారికి విశేష అభిషేకం, పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.

ప్రతి మంగళవారం, కృత్తికా నక్షత్రం మరియు షష్ఠి తిథి రోజుల్లో దేవస్థానం సేవగా (సర్కారీ సేవగా) ఈ విశేష అభిషేకం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

అర్చక స్వాములు దేశంలో శాంతి, సౌభాగ్యాలు నెలకొనాలని, సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలకు ఆయురారోగ్యాలు కలగాలని, ప్రకృతి వైపరీత్యాలు, అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు జరగకుండా ఉండాలని సంకల్పం చేశారు.

ముందుగా మహాగణపతి పూజ నిర్వహించి, అనంతరం శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారికి పంచామృతాభిషేకం, అర్చన, సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణలు నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, వివిధ పండ్ల రసాలతో అభిషేకం జరిపారు.

సుబ్రహ్మణ్యస్వామిని భక్తితో ఆరాధించడం వల్ల ఉద్యోగ, వ్యాపార, వ్యవహారాలలో ఆటంకాలు తొలగి విజయాలు సిద్ధిస్తాయని, శత్రుబాధలు, గ్రహపీడలు, దృష్టిదోషాలు తొలగిపోతాయని, సంతానం కోసం ప్రార్థించే వారికి సంతాన భాగ్యం కలుగుతుందని ఆగమ శాస్త్రాలు పేర్కొంటున్నాయి.

ఈ కార్యక్రమం దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆదేశాల మేరకు నిర్వహించబడింది.