BREAKING
మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
www.ntodaynews.com

కృష్ణా జలాశయాలపై ఖరీఫ్ ఆశలు.. ఎగువ వర్షాలకే ఎదురుచూపు

భక్తి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Jul, 2026 - 05:58 AM
87 వీక్షణలు

తెలుగు రాష్ట్రాల సాగు, తాగునీటి అవసరాలకు కీలకమైన కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల్లో ఎట్టకేలకు వరద ప్రవాహం మొదలైంది. ఎల్‌నినో ప్రభావంతో జూన్‌లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 40 రోజులు గడిచినా ప్రధాన జలాశయాలు నీరసంగా కనిపించాయి. దీంతో రైతుల్లో ఆందోళన నెలకొంది.

ఇటీవల మహారాష్ట్ర, కర్ణాటక ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు పరిస్థితిని కొంతమేర మార్చుతున్నాయి. అల్మట్టి జలాశయానికి వరద నీరు చేరుతుండటంతో, అదే ప్రవాహం కొనసాగితే జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు కూడా నీటి రాక పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

జూన్ నెల నిరాశపరిచినప్పటికీ, జూలై–ఆగస్టులో విస్తారంగా వర్షాలు కురిస్తేనే కృష్ణా బేసిన్ ప్రాజెక్టులు నిండడంతో పాటు ఖరీఫ్ సాగుకు అవసరమైన నీటి లభ్యత మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం కర్ణాటక జలాశయాల్లోకి వస్తున్న వరదలపైనే తెలుగు రాష్ట్రాల రైతుల ఆశలు నిలిచాయి.