BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

కృష్ణా జలాశయాలపై ఖరీఫ్ ఆశలు.. ఎగువ వర్షాలకే ఎదురుచూపు

భక్తి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Jul, 2026 - 05:58 AM
92 వీక్షణలు

తెలుగు రాష్ట్రాల సాగు, తాగునీటి అవసరాలకు కీలకమైన కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల్లో ఎట్టకేలకు వరద ప్రవాహం మొదలైంది. ఎల్‌నినో ప్రభావంతో జూన్‌లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 40 రోజులు గడిచినా ప్రధాన జలాశయాలు నీరసంగా కనిపించాయి. దీంతో రైతుల్లో ఆందోళన నెలకొంది.

ఇటీవల మహారాష్ట్ర, కర్ణాటక ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు పరిస్థితిని కొంతమేర మార్చుతున్నాయి. అల్మట్టి జలాశయానికి వరద నీరు చేరుతుండటంతో, అదే ప్రవాహం కొనసాగితే జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు కూడా నీటి రాక పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

జూన్ నెల నిరాశపరిచినప్పటికీ, జూలై–ఆగస్టులో విస్తారంగా వర్షాలు కురిస్తేనే కృష్ణా బేసిన్ ప్రాజెక్టులు నిండడంతో పాటు ఖరీఫ్ సాగుకు అవసరమైన నీటి లభ్యత మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం కర్ణాటక జలాశయాల్లోకి వస్తున్న వరదలపైనే తెలుగు రాష్ట్రాల రైతుల ఆశలు నిలిచాయి.