BREAKING
సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం
www.ntodaynews.com

లంచాల ఆరోపణలు.. విధుల్లో నిర్లక్ష్యం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం తహసీల్దార్ సస్పెన్షన్

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Jul, 2026 - 05:58 AM
16 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్, ఎన్టీఆర్ జిల్లా: ఇబ్రహీంపట్నం తహసీల్దార్ వై. వెంకటేశ్వర్లును జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విధుల నిర్వహణలో తీవ్రమైన నిర్లక్ష్యం, ప్రభుత్వ ఆదేశాల అమలులో వైఫల్యం, రెవెన్యూ సేవల విషయంలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, లంచాల ఆరోపణలు, ప్రభుత్వ భూముల వ్యవహారాల్లో అవకతవకల ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని ఈ చర్య చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

జిల్లా పరిపాలనకు అందిన ఫిర్యాదులు, విచారణ నివేదికల ఆధారంగా తహసీల్దార్‌పై పలు తీవ్రమైన అభియోగాలు నమోదైనట్లు సమాచారం. ప్రజా విశ్వాసానికి భంగం కలిగేలా వ్యవహరించారని, ప్రభుత్వ సేవల్లో పారదర్శకతను పాటించడంలో విఫలమయ్యారని అధికారులు పేర్కొన్నారు.

ప్రధాన అభియోగాల్లో ఒకటిగా దివంగత కోటయ్య కుటుంబ సభ్యులకు ధృవీకరణ పత్రం జారీ విషయంలో తీవ్ర నిర్లక్ష్యం జరిగినట్లు తేలినట్లు సమాచారం. అలాగే రెవెన్యూ సేవల నిర్వహణలో పరిపాలనా లోపాలు, ప్రజల ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం, ప్రభుత్వ ఆదేశాల అమలులో నిర్లక్ష్యం వంటి అంశాలు కూడా విచారణలో వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.

ఈ అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించిన అనంతరం జిల్లా కలెక్టర్ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.