www.ntodaynews.com
ఏపీ గురుకుల పాఠశాలలో విద్యార్థికి పాముకాటు
ఆంధ్రప్రదేశ్
/
అనంతపురం
అనంతపురం జిల్లా రాగులపాడులోని బాలుర గిరిజన గురుకుల పాఠశాల హాస్టల్లో పాముకాటు ఘటన కలకలం రేపింది. హాస్టల్ గదిలో నిద్రిస్తున్న తొమ్మిదో తరగతి విద్యార్థి తులసీ నాయక్ను పాము కాటువేసింది.
విద్యార్థి అస్వస్థతకు గురికావడంతో పాఠశాల సిబ్బంది వెంటనే ప్రాథమిక చికిత్స అందించి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థికి వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఘటనపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.