www.ntodaynews.com
మనవడి కోసం వంటగదిలోకి వెళ్లిన రేవంత్ రెడ్డి
తెలంగాణ
తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి కుటుంబంతో గడిపిన ఓ ఆత్మీయ క్షణం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మనవడు రేయాన్ష్ కోరిక మేరకు ఆయన స్వయంగా వంటగదిలోకి వెళ్లి పూరీలు తయారు చేశారు.
పూరీలు వేస్తూనే మనవడితో సరదాగా ముచ్చటించిన రేవంత్ రెడ్డి, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపిన దృశ్యాలు వీడియోలో కనిపించాయి. ఈ సందర్భంగా "అమ్మమ్మకు కూడా పూరీలు కావాలి" అని మనవడు చెప్పడం అందరి దృష్టిని ఆకర్షించింది.
రాజకీయ బాధ్యతల మధ్య కుటుంబానికి సమయం కేటాయిస్తూ మనవడి కోరిక తీర్చిన ముఖ్యమంత్రి వీడియోను పలువురు సోషల్ మీడియాలో విస్తృతంగా పంచుకుంటున్నారు.