www.ntodaynews.com
ఒక్క విద్యార్థి కోసం ప్రత్యేక నిర్ణయం.. ఉపాధ్యాయుడితో పాటు విద్యార్థికీ డిప్యుటేషన్
తెలంగాణ
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని క్యాంపు తండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అరుదైన పరిస్థితి నెలకొంది. పాఠశాలలో ఒక్క విద్యార్థి మాత్రమే ఉండటంతో, హెడ్మాస్టర్ శ్రీనివాస్తో కలిసి ఆ విద్యార్థి రితీశ్ను కల్వల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు డిప్యుటేషన్పై పంపించారు.
దీంతో క్యాంపు తండా పాఠశాల తాత్కాలికంగా మూతపడింది. అయితే, విద్యా హక్కు చట్టం స్ఫూర్తికి విరుద్ధంగా పాఠశాలను మూసివేశారంటూ పలువురు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై స్థానికంగా చర్చ కొనసాగుతోంది.